Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ప్ర‌వాసాంధ్రుడి రూ.4.20 కోట్ల విరాళం

Advertiesment
ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ప్ర‌వాసాంధ్రుడి రూ.4.20 కోట్ల విరాళం
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:13 IST)
అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా అనే ప్ర‌వాసాంధృడు ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ర‌వి తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.
 
ఈ సందర్భంగా అదనపు ఈవో, మాట్లాడుతూ,  రవి ఐకా ఇప్పటికే, టిటిడికి చెందిన ప‌లు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలి విడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ  సురేష్ కుమార్ గేదెల కూడా పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ను కాపాడిన 108 సిబ్బందికి స‌న్మానం