Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెళ్లి వస్తుండగా తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఏడుగురి మృతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఘోరం జరిగింది. తూఫాన్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉమ్మడి కడప జిల్లాలోని ఏటూరూ సమీపంలో జరిగింది. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులంతా కలిసి తుఫాను వాహనంలో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలో కడప జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments