Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెళ్లి వస్తుండగా తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఏడుగురి మృతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఘోరం జరిగింది. తూఫాన్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉమ్మడి కడప జిల్లాలోని ఏటూరూ సమీపంలో జరిగింది. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులంతా కలిసి తుఫాను వాహనంలో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలో కడప జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments