Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెళ్లి వస్తుండగా తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఏడుగురి మృతి

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:06 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఘోరం జరిగింది. తూఫాన్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉమ్మడి కడప జిల్లాలోని ఏటూరూ సమీపంలో జరిగింది. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులంతా కలిసి తుఫాను వాహనంలో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలో కడప జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments