576వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:01 IST)
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 576వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, పరిపాలనా భవనాలు ఉన్న ప్రాంతమే రాష్ట్ర రాజధాని అని తెలిపారు.

అమరావతి రాజధాని కూడా అలాగే ఏర్పాటైందన్నారు. దీనిని మార్చడానికి సీఎం జగన్‌కి ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేయటం కోసమే మూడు రాజధానులు అని చెప్పారు. విశాఖ, కర్నూలును రాజధానిగా చేయమని ఐదు కోట్లమందిలో ఒక్కరైనా అడిగారా.. అని ప్రశ్నించారు.

భూములు ఇచ్చిన వారిని రోడ్డుపాలు చేసిన ప్రస్తుత పాలకులపై మోసం కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments