Webdunia - Bharat's app for daily news and videos

Install App

576వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:01 IST)
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 576వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, పరిపాలనా భవనాలు ఉన్న ప్రాంతమే రాష్ట్ర రాజధాని అని తెలిపారు.

అమరావతి రాజధాని కూడా అలాగే ఏర్పాటైందన్నారు. దీనిని మార్చడానికి సీఎం జగన్‌కి ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేయటం కోసమే మూడు రాజధానులు అని చెప్పారు. విశాఖ, కర్నూలును రాజధానిగా చేయమని ఐదు కోట్లమందిలో ఒక్కరైనా అడిగారా.. అని ప్రశ్నించారు.

భూములు ఇచ్చిన వారిని రోడ్డుపాలు చేసిన ప్రస్తుత పాలకులపై మోసం కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments