నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం: మంత్రి తానేటి వనిత

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:59 IST)
జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు మహిళాలకు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  
 
శనివారం  ఏలూరు జిల్లా సహకార బ్యాంక్ సొసైటీ సభ్యురాలుగా ఎంపికైన బండి లక్ష్మి నారాయణమ్మ తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులును  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బండి లక్ష్మీ నారాయణమ్మను అభినందించారు.

బడుగు, బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచి వారికి అండగా నిలిచి జగనన్న నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు.  మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు.  ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున మహిళలు పేరునే అమలు చెయ్యడం , ఇటీవల చేపట్టిన జగనన్న కాలనీలో మహిళల పేరునే పట్టాల పంపిణీ చేశామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మంత్రి ని కలిసిన వారిలో బండి పట్టాభి రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments