Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్‌నంబర్‌ అనుసంధానం

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:52 IST)
సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డుతో ఫోన్‌నంబరు అనుసంధానం తప్పనిసరి. దీని కోసం చాలా మంది ఇటీవల ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇకనుంచి ఆధార్‌ కార్డులో ఫోన్‌నంబరు అప్‌డేట్‌ చేయించుకునేందుకు సీడింగ్‌ కేంద్రం వరకు వెళ్లనక్కర్లేదు.

పోస్టుమ్యాన్‌కు కబురు పెడితే ఆయనే వచ్చి అవన్నీ మీ ఇంటి వద్దే చేస్తారు. రూ.50 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ జూన్‌ నుంచి ఈ తరహా సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5లక్షల మంది ఈ సేవలు పొందారు.

భీమవరం, ఏలూరు, గుడివాడ, నెల్లూరు, విజయనగరం తపాలా డివిజన్లలో ఈ సేవలు ఇప్పటివరకు ఎక్కువగా అందాయి. పోస్టుమ్యాన్ల వద్ద ఒక మొబైల్‌ అప్లికేషన్‌ ఉంటుంది. దాని సాయంతో వారు వినియోగదారుల మొబైల్‌ నంబరును ఆధార్‌ కార్డుకు అనుసంధానిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సాయంతో గ్రామీణ తపాలా సేవకులు వినియోగదారులను చేరుకుంటున్నారు. తమకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా సుమారు 1.92 కోట్ల ఆధార్‌ కార్డుల ఫోన్‌నంబర్లు అప్‌డేట్‌ చేయాల్సి ఉందని ఏపీఎంజీ సుధీర్‌బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments