Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరంలో దొంగల చేతివాటం : 5 కేజీల బంగారం చోరీ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:10 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. స్థానికంగా ఉండే రవి జ్యూవెలరీ షాపులో 5 కేజీల బంగారాన్ని చోరీ చేశారు. దుండగులు దుకాణం పైకప్పును తొలగించి షాపులోకి ప్రవేశించి మొత్తం 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 
 
దుకాణం యజమాని బుధవారం ఉదయం షాను తెరిచి చూడగా, అల్మారాల్లోని పెట్టెలు ఖాళీగా కనిపించాయి. దీంతో లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరిస్తున్నారు. 
 
చోరీ జరిగిన ప్రాంతాన్ని విజయనగరం జిల్లా డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాస రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలను మరోవైపునకు తిప్పి, బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారుల సేకరించే పనిలో నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments