సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (13:07 IST)
సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా, నగరాల నుంచి గ్రామాలకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయివుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. ఈ ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు భారతీయ రైల్వే శాఖ సంక్రాంతి స్పెషల్ పేరుతో ప్రత్యేక బస్సులు, రైళ్లను నడపడం ఆనవాయితీగా వస్తుంది. 
 
ఈ యేడాది కూడా సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను అదనంగా నడిపేందుకు సిద్ధమైంది. 
 
సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది. ఇందులో భాగంగా, ఈ నెల 12వ తేదీన కాచిగూడ - కాకినాడ (82724), సికింద్రాబాద్ - విశాఖపట్టణం (82719) ప్రాంతాల మధ్య సువిధ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. 
 
అలాగే, 13వ తేదీన కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07450), విశాఖపట్టణం - సికింద్రాబాద్ (07499) ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంది. ఈ రైళ్లు తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రవేశించినప్పటికీ రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో మాత్రం ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments