Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (13:07 IST)
సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా, నగరాల నుంచి గ్రామాలకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయివుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. ఈ ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు భారతీయ రైల్వే శాఖ సంక్రాంతి స్పెషల్ పేరుతో ప్రత్యేక బస్సులు, రైళ్లను నడపడం ఆనవాయితీగా వస్తుంది. 
 
ఈ యేడాది కూడా సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను అదనంగా నడిపేందుకు సిద్ధమైంది. 
 
సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది. ఇందులో భాగంగా, ఈ నెల 12వ తేదీన కాచిగూడ - కాకినాడ (82724), సికింద్రాబాద్ - విశాఖపట్టణం (82719) ప్రాంతాల మధ్య సువిధ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. 
 
అలాగే, 13వ తేదీన కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07450), విశాఖపట్టణం - సికింద్రాబాద్ (07499) ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంది. ఈ రైళ్లు తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రవేశించినప్పటికీ రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో మాత్రం ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments