Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ చేసుకున్నారు.. పైలోకానికెళ్లారు.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం

Webdunia
బుధవారం, 1 మే 2019 (10:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా మందు పార్టీ చేసుకుని ఇంటికి బయలుదేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు వార్షిక పరీక్షలు పూర్తికావడంతో బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకున్నారు. తర్వాత కారులో తిరుగు ప్రయాణ మార్గంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. 
 
ఈ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన స్ఫూర్తి (22), చాదర్‌ఘాట్‌‌కు చెందిన ప్రణీత(22) ప్రగతి నగర్‌కు చెందిన చైతన్య (23)లు మృతి చెందారు. కుట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినిత్ రెడ్డి‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినిత్ రెడ్డిని ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments