Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:07 IST)
ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి మంగళం టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి మేడా సుందరరావు ఆదేశాల మేరకు సిఐ వెంకటరవి ఆధ్వర్యంలోని ఆర్‌ఎస్‌ఐ విశ్వనాధ్‌ బృందం సోమవారం నుంచి పూతల పట్టునాయుడుపేట రహదారిలో తనిఖీలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామున చంబడిపాలెం సమీపంలోని రోడ్డుకు 50 మీటర్ల దూరంలో పోలీసులను చూసి ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్‌ సత్యనారాయణపురంకు చెందిన పాలూరి బాలు, తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌కు చెందిన ఆర్‌.మణికంఠన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments