Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ ఓ తుపాకీ రాముడు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:04 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు."కేటీఆర్ ఓ తుపాకీ రాముడు.. అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి 32 శాతం నిధులిస్తే, ఎన్డీయే వచ్చాక 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నామని సంజయ్ తెలిపారు.

కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారని, కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సచివాలయానికి వెళ్లని వాడికి కొత్తది ఎందుకని ప్రశ్నించారు.
 
ఉద్యోగి చనిపోయిన తర్వాత, పదవీ విరమణ  తర్వాత పీఆర్‌సీ ఇస్తారా, దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు.

ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించాడన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి, కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments