Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (19:35 IST)
కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇవి శృతిమించడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలోని హోజాయ్ జిల్లాలో ఓ జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ బంధువు ఈ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉండిపోయారు.
 
ఈ దాడిలో మొత్తం 24 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వారిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఘటనపై అస్సాం ఐఎంఏ విభాగం ఆందోళనకు దిగింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments