Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు మృతి.. కర్నూలులో విషాధం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:36 IST)
బిస్కెట్లు తినడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మరో బాలిక తీవ్ర అస్వస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి ఇది జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
మహబూబ్ కొడుకు హుస్సేన్ బాషా(6), కూతురు హుసేన్ బీ(4) కలిసి బాబాయి కూతురు బషిరున్(8)తో కలిసి గ్రామంలోని ఓ కిరాణా షాపులో బిస్కెట్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత అంతా కలిసి వాటిని తిన్నారు. కొంతసేపటి తర్వాత చిన్నారులు మెల్లగా అస్వస్థతకు గురయ్యారు. 
 
కుటుంబ సభ్యులు దీన్ని గమనించి వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే హుసేన్ భాషా మరణించాడు. అక్కడే చికిత్స పొందుతూ హుసేన్ బీ కూడా చనిపోయింది. వెంటనే వైద్యులు మరో చిన్నారిని కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments