Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం.. చాక్లెట్ ఇస్తానని ఆశచూపి..?

ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం.. చాక్లెట్ ఇస్తానని ఆశచూపి..?
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (15:36 IST)
ఆరేళ్ల బాలికపై కర్నూలులో ఘోరం జరిగింది. 15 ఏళ్ల బాలుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు గ్రామానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు వ్యవసాయ, ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజులానే ఈ నెల 2న గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీ పని చేసేందుకు వెళ్లారు. ఈ దంపతుల ఆరేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. పొరుగింటి 15 ఏళ్ల బాలుడు.. బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి బాత్‌రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన బాలిక.. వారం రోజుల క్రితం జరిగిన ఘటనను గురువారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సంజామల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాలుడిపై ఫోక్సో చట్టం, సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌పై ప్రశంసలు కురిపించిన చైనా.. దాయాదీ దేశం త్యాగాలు చేసిందట..