Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క కరిచిన ఆరు నెలలకు ర్యాబీస్ - బాలుడి మృతి

Webdunia
సోమవారం, 24 జులై 2023 (08:16 IST)
కాకినాడ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిసిన ఆరు నెలలకు ర్యాబీస్ వ్యాధి సోకడంతో 17 యేళ్ల మైనర బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని గొల్లప్రోలులో వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం కుక్క కరవడంతో భయపడిన బాలుడు.. విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీంతో ఆ బాలుడికి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. పైగా, నీటిని చూసి భయపడిపోయాడు. దీంతో ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన తేలు ఓంసాయి అనే 17 యేళ్ళ బాలుడిని ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ విషయాన్ని అతను ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతనికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్ళు కూడా తాగలేక పోయిన బాలుడు... ఆ నీటిని చూసి భయంతో వణికిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని శనివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ర్యాబీస్ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. పైగా, వ్యాధి ముదరడతో పరిస్థితి చేజారిపోయిందని వారు తెలిపారు. కాగా, కుక్కకాటుకు గురైన రోజునే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌తో పాటు టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments