Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (09:41 IST)
కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కేరళలోనూ ఇటీవల ఓ విద్యార్థిని ఇంటిలో స్మార్ట్ ఫోన్ కానీ టీవీ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇదే తరహాలో ఆన్‌లైన్ పాఠాలు మరో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నామనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలోని చిరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని చిరంగ్ జిల్లాలో ఓ బాలుడు(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇతడిది నిరుపేద కుటుంబం కావడంతో బతుకుదెరువు కోసం తల్లి బెంగళూరుకు వలసపోయింది. తండ్రి ఏ పని చేయడం లేదు.
 
దీంతో సదరు బాలుడు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్ తండ్రి ఇవ్వలేకపోయాడు. దీంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నానే మనస్తాపంతో సదరు బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments