Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (09:41 IST)
కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కేరళలోనూ ఇటీవల ఓ విద్యార్థిని ఇంటిలో స్మార్ట్ ఫోన్ కానీ టీవీ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇదే తరహాలో ఆన్‌లైన్ పాఠాలు మరో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నామనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలోని చిరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని చిరంగ్ జిల్లాలో ఓ బాలుడు(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇతడిది నిరుపేద కుటుంబం కావడంతో బతుకుదెరువు కోసం తల్లి బెంగళూరుకు వలసపోయింది. తండ్రి ఏ పని చేయడం లేదు.
 
దీంతో సదరు బాలుడు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్ తండ్రి ఇవ్వలేకపోయాడు. దీంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నానే మనస్తాపంతో సదరు బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments