Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వచ్చేసింది.. ఆ బాలికపై ఐదుగురు, 5రోజులు..

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:12 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురి దుండగులతో కూడిన ఓ బృందం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులో కొన్ని నెలల పాటు చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా చెన్నై, పురసైవాక్కం ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. పుళియంతోపుకు చెందిన 16 ఏళ్ల బాలిక.. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటిని వదిలి బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూలై మూడో తేదీ ఇంటి నుంచి బయటపడిన ఆ బాలికను ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తామనని తీసుకెళ్లింది. ఇలా ఆ బాలికను పురసైవాక్కంలోని నిషా అనే ఓ మహిళ ఇంట్లో నిర్భంధించారు. ఆపై ఐదుగురు దుండగులు బాలికపై ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
లైంగికంగా చిత్ర హింసలకు గురిచేశారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో షాకైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబీనా, నిషా, ముబీనా అనే ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద విచారణ జరిపిన పోలీసులు 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం