Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వచ్చేసింది.. ఆ బాలికపై ఐదుగురు, 5రోజులు..

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:12 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురి దుండగులతో కూడిన ఓ బృందం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులో కొన్ని నెలల పాటు చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా చెన్నై, పురసైవాక్కం ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. పుళియంతోపుకు చెందిన 16 ఏళ్ల బాలిక.. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటిని వదిలి బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూలై మూడో తేదీ ఇంటి నుంచి బయటపడిన ఆ బాలికను ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తామనని తీసుకెళ్లింది. ఇలా ఆ బాలికను పురసైవాక్కంలోని నిషా అనే ఓ మహిళ ఇంట్లో నిర్భంధించారు. ఆపై ఐదుగురు దుండగులు బాలికపై ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
లైంగికంగా చిత్ర హింసలకు గురిచేశారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో షాకైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబీనా, నిషా, ముబీనా అనే ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద విచారణ జరిపిన పోలీసులు 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం