Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు బరిలో 14 మంది అభ్యర్థులు.. అయినా గెలుపు ఏకపక్షమే..

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (11:45 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయి. దీనికి కారణం ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉండటం.
 
ఈ స్థానం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల కోసం మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
అయితే, నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన గురువారం బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో తుది పోరులో 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి ఈ నెల 23వ తేదీ పోలింగ్ జరుగనుండగా, 26వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
ఈ ఎన్నికల బరిలో ఉన్న వారిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్, బీఎస్పీ తరపున నందా ఓబుల్‌లు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పోటీకి దూరంగా ఉన్నాయి. 
 
కాగా, ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments