Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలలో 10-వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, సత్యసాయి జిల్లా, కదిరి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత తొమ్మిది నెలల ముందు తాగునీటి కోసం స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. 
 
ఆ సమయంలో స్టాఫ్ రూమ్‌లో వున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటనను ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యంపై ఎవ్వరికీ చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న రెడ్డి నాగయ్య పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె నిండు గర్భిణీ అని తేల్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
పురిటి నొప్పులు రావడంతో ఆ బాలికకు అబ్బాయి పుట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం