Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులొచ్చేదాక బాలిక గర్భవతి అనే విషయం తెలియదా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:34 IST)
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రా ప్రభుత్వ పాఠశాలలో 10-వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, సత్యసాయి జిల్లా, కదిరి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత తొమ్మిది నెలల ముందు తాగునీటి కోసం స్టాఫ్ రూమ్‌కు వెళ్లింది. 
 
ఆ సమయంలో స్టాఫ్ రూమ్‌లో వున్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార ఘటనను ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యంపై ఎవ్వరికీ చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న రెడ్డి నాగయ్య పలుమార్లు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె నిండు గర్భిణీ అని తేల్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
పురిటి నొప్పులు రావడంతో ఆ బాలికకు అబ్బాయి పుట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం