Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజీ బస్సు.. వేర్వేరు ప్రాంతాల్లో..?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:03 IST)
Accident
ఏపీలోని నంద్యాల జిల్లాలోని తమ రాజు పల్లె సమీపంలో మూలమెట్ట పెద్దమ్మ తల్లి యూటర్న్ వద్ద విజయానికేతన్ స్కూల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
సంఘటన అనంతరం చిన్నారులను ఇళ్ళకు తిరిగి పంపించేశారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
మరోవైపు తమిళనాడులోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి-తిరువానైక్కావల్‌లో స్కూలు వ్యానును కాలేజీ బస్సు ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో పాటు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
ఈ ప్రమాదంతో తిరువానైకావల్ శ్రీరంగం ప్రధాన రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments