Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం - ఏకంగా 40మందిలో లక్షణాలు

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:00 IST)
విశాఖపట్టణం ఏజెన్సీలో అంత్రాక్స్ అలజడి కలకలం రేపింది. పలువురు చిన్నారులతో పాటు ఏకంగా 40 మంది వరకు ఈ వ్యాధి సోకింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. 
 
దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏజెన్సీ జిల్లాలోని అనేక మందికి అంత్రాక్స్ వ్యాధి సోకింది. వీరిలో ఏకంగా 15 మంది వరకు చిన్నారులు ఉండటం గమనార్హం. గత వారం రోజులుగా బాధితులు శరీరంపై కురుపులతో బాధపడుతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నమూనాలు బాధితులతో పాటు స్థానికుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశాఖలోని కేజీహెచ్ మైక్రో బయాలజీ విభాగానికి పంపిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి విశ్వేశ్వర రావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments