Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సునామీ : నాలుగో అతిపెద్ద పార్టీగా వైకాపా

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైకాపా 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, 22 లోక్‌సభ సీట్లలో గెలుపొందింది. ఫలితంగా సత్తాచాటి.. దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తర్వాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా అవతరించింది. దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్‌ పార్టీకి 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తర్వాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, తెరాస 9, ఎస్పీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నాడీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments