Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రపై దండయాత్ర చేస్తున్న కాలకేయుడు.. తస్మాత్ జాగ్రత్త : నారా లోకేష్

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:53 IST)
తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని భల్లాల దేవుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్చడంపై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేనా... ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాలకేయుడుతో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన నరేంద్ర మోడీ భల్లాల దేవుడికి సరిగ్గా సరిపోతారని అన్నారు. 
 
ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆరోపించారు. అలాంటి మోడీ... నవ్యాంధ్రపై కాలకేయుడులా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న చంద్రబాబు నాయుడు ఓ బాహుబలి లాంటివారని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments