లోకజ్ఞానం లేని జో(లో)కేశ్.. దేశంలో 28 రాష్ట్రాలేనట..

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ మరోమారు తనకు లోకజ్ఞానం లేదని నిరూపించారు. ఒక రాష్ట్ర మంత్రిగా, ఏకంగా మూడు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియలేదు. తన ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా ప్రసంగాలు చేస్తుండటం వల్ల నవ్వులపాలవుతున్నారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో తనను గెలిపించాలని ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గ ప్రచారం చేశారు. అపుడు ఆయన మాట్లాడుతూ, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయంటూ పప్పులో కాలేశారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియని నాయకుడు మంత్రి అయ్యాడంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. 
 
గతంలో ఏపీతో పాటు.. తెలంగాణా రాష్ట్రాల్లో పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరుగనుంది. కానీ, లోకేశ్ మాత్రం 9వ తేదీన జరిగే పోలింగ్‌లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ తడబడిన విషయం తెల్సిందే. అలాగే, శనివారం చేసిన ప్రచారంలో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు బదులు మార్చి 23న ఓట్ల లెక్కింపు ఉందంటూ మరోసారి నోరుజారారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments