Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఎన్నికల ప్రచార యుద్ధానికి తెర... ఆ తర్వాత తాయిలాలతో ఎర

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలతో పొలిటికల్ వేడి మరింత పెరిగింది. ఇదిలావుంటే ఈనెల 11వ తేదీ గురువారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్ని ప్రచార మైకులు మూగబోనున్నాయి. అంటే ప్రచార యుద్ధానికి తెరపడనుంది. 
 
ఇప్పటివరకు బాకా ఊది ప్రసంగించిన నేతలంతా మంగళవారం సాయంత్రం నుండి విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద రేపటి నుండే 144 సెక్షన్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
కాగా ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, వారిని తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలు వీలైనంత వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. 
 
అలాగే ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, మే 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments