Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఎన్నికల ప్రచార యుద్ధానికి తెర... ఆ తర్వాత తాయిలాలతో ఎర

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలతో పొలిటికల్ వేడి మరింత పెరిగింది. ఇదిలావుంటే ఈనెల 11వ తేదీ గురువారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్ని ప్రచార మైకులు మూగబోనున్నాయి. అంటే ప్రచార యుద్ధానికి తెరపడనుంది. 
 
ఇప్పటివరకు బాకా ఊది ప్రసంగించిన నేతలంతా మంగళవారం సాయంత్రం నుండి విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద రేపటి నుండే 144 సెక్షన్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
కాగా ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, వారిని తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలు వీలైనంత వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. 
 
అలాగే ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, మే 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments