Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ లక్ష్మీనారాయణ... జనసేన మేనిఫెస్టోను బాండ్ పేపరుపై... విశాఖలో తిరుగులేదా?

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (22:17 IST)
సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వివి లక్ష్మీనారాయణ తను ప్రకటించినట్లుగానే హామీలన్నిటినీ ఓ బాండ్ పేపరుపై పెట్టి సంతకం చేశారు. జనసేన తరపున విశాఖపట్టణం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరుగుతూ జనసేన గెలిస్తే ఏం చేస్తామోనన్న విషయాలను విపులీకరించి చెపుతున్నారు. 
 
కేవలం చెప్పడమే కాదు... ఆ హామీలను నెరవేర్చి తీరుతామనీ, మాట తప్పకుండా ప్రజలకు జవాబుదారీతనంగా వుండాలని, అందుకే బాండ్ పేపరుపై జనసేన మ్యానిఫెస్టో హామీలన్నిటినీ విశాఖ ప్రజల ముందు వుంచుతున్నట్లు తెలిపారు. ఎంపీగా గెలిస్తే తను ప్రకటించిన విశాఖపట్టణం స్పెషల్ మ్యానిఫెస్టోలో తెలిపిన హామీలన్నిటినీ నెరవేరుస్తానని వెల్లడించారు. దీనితో పాటు రీచ్ యువర్ ఎంపీ పేరిట మొబైల్ యాప్‌తో విశాఖవాసులకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. 
 
విశాఖను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రతి మూడు నెలలకోసారి మేనిఫెస్టో అమలు తీరును వివరిస్తూ ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. మొత్తమ్మీద ప్రజలకిచ్చే హామీలు నీటిమూటలుగా మారుతున్న సమయంలో లక్ష్మీనారాయణ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విశాఖలో జనసేన గెలుపు ఖాయం అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments