కళ్లలో కారం చల్లి.. గొడ్డళ్లు, వేటకొడవలితో వైకాకా కార్యకర్తల హత్య

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్ళతో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ హత్య జరిగింది. అధికార పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు చేజారిపోకుండా గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాపులో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్యకు చేయించారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments