Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లలో కారం చల్లి.. గొడ్డళ్లు, వేటకొడవలితో వైకాకా కార్యకర్తల హత్య

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్ళతో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ హత్య జరిగింది. అధికార పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు చేజారిపోకుండా గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాపులో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్యకు చేయించారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments