Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా హ్యాపీగా ఉంది.. ప్రజలు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు : లక్ష్మీపార్వతి

Webdunia
సోమవారం, 27 మే 2019 (08:31 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంపై వైకాపా మహిళా నేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ప్రజలు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారనీ, ఈ ఫలితాలు చాలా సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యంగా, ఎన్టీఆర్‌నే కాకుండా, ఆయన స్థాపించిన పార్టీని పతనం చేసి, రాజకీయ వ్యవస్థలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి నిష్క్రమించాడన్న సంతోషాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి కనీసం 50 లేదా 60 సీట్లు వచ్చివున్నట్టయితే చంద్రబాబు అనే వ్యక్తి మళ్లీ బతికివుండేవాడని, కానీ, ఇపుడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇక నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
అదేసమయంలో తనకు వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. తన భర్త జీవించివున్న సమయంలోనే మంత్రి పదవులు తీసుకోవాలని ఒత్తిడి చేశారనీ, కానీ నేనుమాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఆయన తండ్రిలా పాలన చేయాలన్నారు. 
 
వైసీపీలో చేరిన తనను ఓ తల్లిలా జగన్ ఆదరించారన్నారు. ఏనాడూ తనకు పదవి కావాలని ఆయనను అడగలేదన్నార. 2014లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని, ఆ తర్వాత వద్దులేమ్మా.. ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పారనీ, దీంతో తాను కూడా మిన్నకుండిపోయానని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments