Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మంత్రివర్గంలోకి వైకాపా : హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:44 IST)
కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరనుంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు రావడంతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం హుటాహుటిన హస్తినకు బయలుదేరనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్‌కు అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. 
 
కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ చేరబోతోందనే ప్రచారం ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. వైసీపీకి 2 కేబినెట్, ఒక సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రధానితో సీఎం జగన్ విపులంగా చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారు. 
 
మరోవైపు, పలు విషయాలపై మోడీతో జగన్ చర్చించబోతున్నారు. ఇందులో ప్రధానంగా శాసనమండలి రద్దు అంశం కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. 
 
ఇదిలావుండగా, కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరితే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉన్నాయి. బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ పరిణామం పట్ల జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments