సీఎం జగన్‌కు రఘురామ పదో లేఖ ... విజయసాయికి కళ్లెం వేయకుంటే..

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు 10వ లేఖను రాశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. 
 
ఉత్తరాంధ్ర ప్రతినిధి విజయసాయిరెడ్డి నిరంతరం ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం చేకూరుతుందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. 
 
విజయసాయి రెడ్డిని, మంత్రులను పార్టీ మంచి కొరకు నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని రఘురామ కోరారు. 
 
మరోవైపు, అశోక్‌గజపతి రాజుపై ఫోర్జరీ కేసు ఉందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లనున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అశోక్‌గజపతి మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే చైర్మన్‌ అని, విజయనగరం జిల్లాకు రాజు కాదని అన్నారు. ఆయన వందల ఎకరాలు దోచుకున్నారని, వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. 
 
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు కేసుల్లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాము అప్పీల్‌కు వెళుతున్నామని చెప్పారు. అధికార నియామకాల్లో లింగ భేదం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చినా, సంచయిత నియామకం చెల్లదంటూ కోర్టుకు వెళ్లిన ఆయనకు మహిళలపై గౌరవం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments