Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపండ్రా.. ఈ ఎదవ చెత్త... నీ బాబు... నీ అమ్మకుకాని కులం నీకెలా వచ్చిందిరా రెడ్డి?

Webdunia
గురువారం, 13 మే 2021 (08:02 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారన్న ఆయన.. తనను విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటానని వ్యాఖ్యానించారు. 
 
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్‌ అన్నట్టు గిల్లితే గిల్లుంచుకోవాలా? వాయిస్ వినిపించకూడదా? ఆపండ్రా... ఈ ఎదవ చెత్త' అని మండిపడ్డారు. 
 
రెడ్డి క్యాస్ట్‌ను మరోసారి ఎత్తి చూపిన ఆయన.. 'మీకు మీరే అనేసుకుంటే సరిపోతుందా? నీ బాబు... నీ అమ్మ కులం సర్టిఫికేట్లలో కాపు అని ఉంటే... రెడ్డి ఎలా అవుతారు? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకుని రెడ్లు.. రెడ్లు అనుకుంటే నీ తండ్రి కులం, తల్లి కులం కానిది నీకెలా వచ్చిందిరా రెడ్డి? వైఎస్ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కాపు ఉంటే... జగన్ 'రెడ్డి' ఎలా అవుతాడురా.. కాపే అవుతాడు' అని చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రధానమంత్రి కావాలని ఉందని అన్నారు. ప్రజల ప్రాణాలనుఫణంగా పెట్టి కూడగట్టిన డబ్బులతో ప్రధానమంత్రికావాలన్న ఆయన కోరికను పైనున్న దేవతలు, ఆయన నమ్మిన క్రీస్తు కూడా హర్షించరని అన్నారు.
 
ఏపీలో కరోనా బాధితులకు చాలా అన్యాయం జరుగుతోందని రఘురామ విమర్శించారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని, సీఎం జగన్ నిర్లక్ష్యంవలనే 46 మంది చనిపోయారని ఆరోపించారు. మన తప్పు కానప్పటికి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు. 
 
సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంకాదని.. జగన్‌పై కేసు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. 
 
కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవుపలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments