Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అదుపులో గాడితప్పిన ప్రభుత్వం.. శవాలపై రాజకీయాలొద్దు...

Webdunia
గురువారం, 13 మే 2021 (07:53 IST)
దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో శవాలపై రాజకీయాలు చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. 
 
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనీయని వారిలో నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒకరు. ఈయన ఇపుడు అనూహ్యంగా మోడీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
 
అదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీహార్‌లో గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అంశాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments