Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అదుపులో గాడితప్పిన ప్రభుత్వం.. శవాలపై రాజకీయాలొద్దు...

Webdunia
గురువారం, 13 మే 2021 (07:53 IST)
దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో శవాలపై రాజకీయాలు చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. 
 
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనీయని వారిలో నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒకరు. ఈయన ఇపుడు అనూహ్యంగా మోడీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
 
అదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీహార్‌లో గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అంశాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments