Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారం అనుభవించి ఆఖర్లో పార్టీ మారడం ఇష్టం లేదు : వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:20 IST)
ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఎన్నికల సమయంలో పార్టీ మారడం ఇష్టం లేదని నెల్లూరు గ్రామీణ వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మరోమారు అధికార వైకాపా నేతలపై మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం ఇష్టం లేదు. అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డాను అని వెల్లడించారు. పార్టీకి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి అండగా నిలుస్తున్న తన అనుచరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వాటిని లెక్క చేయకుండా తన వెన్నంటి నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని వెల్లడించారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేపించిన తర్వాత తన రాజీనామా అడగాలని సూచించారు. దీన్ని స్పీకర్ ఆమోదించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్‌కి పంపితే అప్పుడు తాను స్పందిస్తానని వెల్లడించారు.
 
ఇరుకళల అమ్మవారి జాతర నిర్వహణకు అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తానని ఇందులో కూడా రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటానన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్ష అని, నిర్ణయం తీసుకోవాల్సింది టీడీపీ అధినేత చంద్రబాబేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments