Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణం జాప్యానికి వైకాపా కాదు.. టీడీపీనే : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (16:30 IST)
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడానికి తమ ప్రభుత్వం కాదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఏపీ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన శుక్రవారం పోలవరం వద్ద జరుగుతున్న కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులతో పాటు ఇతర పనులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. 
 
గత ప్రభుత్వం తొందరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కూడా గత టీడీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాపర్ డ్యామ్ పనులను గాలికి వదిలివేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపర్ డ్యాప్ ఎత్తును పెంచామని చెప్పారు. 
 
అదేసమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఈ ప్రాజెకు నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపకపోగా నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments