Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం ఎంపీ సంగతి తేల్చేద్ధాం : ప్రత్యేక విమానంలో హస్తినకు వైకాపా ఎంపీలు

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:53 IST)
పార్టీలో రెబెల్ ఎంపీగా ఉన్న నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సంగతి అటో ఇటో తేల్చాలన్న పట్టుదలతో వైకాపా నేతలు ఉన్నారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక విమానంలో శుక్రవారం హస్తినకు వెళ్లనున్నారు. వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై, నరసాపురం ఎంపీ గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, పార్టీ ధిక్కరణ చర్యల కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయనున్నారు. 
 
రఘురామకృష్ణంరాజుకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా పంపించారు. వీటికి సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments