Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందబలంతో తప్పుడు కేసులు పెట్టి వేధించారు: కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి ఫైర్

Webdunia
బుధవారం, 3 జులై 2019 (20:04 IST)
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నేరమయం చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి నేర రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎలక్ట్రోరల్‌ రిఫార్మ్స్‌ పైన బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. 
 
కాంగ్రెస్ పార్టీ మందబలంతో ప్రత్యర్థులను అణిచివేయాలని చూసిందని ఆరోపించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన చరిత్రలో ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటంతో పాటు నిందితులుగా క్రియేట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. 
 
విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు అడుగడుగునా అడ్డు తగిలారు ఎంపీలు జైరాం రమేష్, బీకే హరిప్రసాద్‌లు. మరోవైపు నిజమైన ప్రజాస్వామ్యానికి, సమసమాజ సాధనకు ఎన్నికల్లో సంస్కరణలు అత్యంత అవసరం అని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్‌ రోల్స్‌పై పారదర్శకత, విశ్వసనీయత అవసరమన్నారు. 
 
బూత్‌ లెవల్‌ అధికారులకు ఎన్నికలపై సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌ ఎలక్షనీరింగ్‌ జరగాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని, ఎన్నికలకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments