Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (19:05 IST)
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం క్వింటాల్ వరి ధాన్యంపై రూ.65, నువ్వులపై రూ.236, పత్తిపై రూ.105, పెసర్లపై రూ.100, కందులపై రూ.125, పొద్దుతిరుగుడు పువ్వుపై రూ.262, సోయాబీన్‌పై రూ.311 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments