రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (19:05 IST)
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం క్వింటాల్ వరి ధాన్యంపై రూ.65, నువ్వులపై రూ.236, పత్తిపై రూ.105, పెసర్లపై రూ.100, కందులపై రూ.125, పొద్దుతిరుగుడు పువ్వుపై రూ.262, సోయాబీన్‌పై రూ.311 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

తర్వాతి కథనం
Show comments