Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు ఎంపీ ఎన్నికలు : మిథున్ రెడ్డి ఖర్చు పెట్టింది అంతేనా?

చిత్తూరు ఎంపీ ఎన్నికలు : మిథున్ రెడ్డి ఖర్చు పెట్టింది అంతేనా?
, ఆదివారం, 30 జూన్ 2019 (11:48 IST)
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడికావడం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం, ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు పెట్టిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలు పెట్టిన ఖర్చు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముగిసిన ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ శివప్రసాద్‌ రూ.38 లక్షలు వ్యయం చేయగా వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప రూ.23 లక్షలు వెచ్చించారు. 
 
అలాగే, రాజంపేట నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోలిస్తే రిజర్వుడు నియోజకవర్గమైన చిత్తూరులోనే అభ్యర్థులు అధికంగా ఖర్చు చేయడం తమాషాగా అనిపించినా అధికారిక లెక్కలు కావడంతో ఆశ్చర్యపోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు. 
 
రాజంపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సత్యప్రభ రూ.29 లక్షలు ఖర్చు చేస్తే చిత్తూరులో టీడీపీ అభ్యర్థి రూ.38 లక్షలు పెట్టారు. అలాగే రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి రూ.15 లక్షలు పెడితే చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప రూ.23 లక్షలు వెచ్చించారు. వీరందరికంటే రాజంపేట కాంగ్రెస్‌ అభ్యర్థి షాజహాన్ అత్యధికంగా ఖర్చు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటవీ రేంజ్ ఆఫీసర్‌ చేయి విరగ్గొట్టిన ఎమ్మెల్యే తమ్ముడు