Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక విమానం పేరుతో ఏదో షో చేసుకుంటున్నారు : రఘురామకృష్ణంరాజు

Webdunia
గురువారం, 2 జులై 2020 (20:28 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైకాపా ఎంపీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైకాపా ఎంపీలు ప్రత్యేక విమానంలో శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనిపై రెబెల్ ఎంపీ స్పందించారు. సీఎం జగన్‌ను పొగుడుతూనే వైసీపీ ఎంపీలను సుతిమెత్తంగా ఏకి పారేశారు. వైసీపీ ఎంపీలు విమానంలో ఢిల్లీ వెళ్లి ఓం బిర్లాను కలవాలనుకోవడంపై కూడా రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు.
 
'ప్రభుత్వ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ప్రభుత్వ విమానంలో ఢిల్లీలో వెళ్లి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడమేంటి?. మెయిల్ ద్వారా పంపొచ్చు. ఏదో షో చేసుకుంటున్నారు అంతే. ఇదంతా పార్టీ వ్యూహం.. ప్రభుత్వం ఖర్చులో వెళ్లిపోతుంది. ఎంపీలు ఢిల్లీ వెళ్లిన ఖర్చును పార్టీ ఖర్చులో రాస్తారో.. ప్రభుత్వం ఖర్చులో రాస్తారో చూడాలి. 
 
నేను మా ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాను. పార్టీని పల్లెత్తు మాట అనలేదు. పార్టీలోని కొందరు.. దేవుడు భూములను అమ్ముకుందామనుకుంటున్నారు. ఇవాళ చిన్న భూమితో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. అలా జరగకూడదని ముఖ్యమంత్రి జగన్‌కు తెలియజేశా. ఆయన పెద్ద మనసుతో ఆపడం జరిగింది. 
 
ఇసుకతో పాటు ఒకటి, రెండు విషయాలు కూడా చెప్పా. పార్టీలో పెద్దలు దేవుడు భూములు అమ్ముకుంటున్నారని చెప్పలేదు, ఇళ్ల స్థలాల్లో గోల్‌మాల్ చేస్తున్నారని నేను చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లా. పార్టీకి ఎందుకు కోపం వచ్చిందో. పార్టీ నాకు ఎందుకు షోకాజ్ నోటిస్ ఇచ్చిందో. కుంభకోణాలకు, పార్టీకి ఏం సంబంధమో నాకు అర్థం కావడంలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments