ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (20:02 IST)
ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో నాలుగో నిందితుడుగా అరెస్టయిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయమూర్తి ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. దాదాపు ఏడు గంటల పాటు విచారణ జరిపిన తర్వాత శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆయనను ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచగా, ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. 
 
ఈ కేసులో మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించగా, సిట్ తరపున కోటేశ్వర రావు వాదనలు వినిపించారు. తాము కస్టడీ కోరుతున్నందున మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్‌కు పంపాలని సిట్ కోరింది. అయితే, మిథన్ రెడ్డి ఓ ఎంపీ అని, ఆయనకు వై కేటగిరీ భద్రత ఉందని, అందువల్ల నెల్లూరు జిల్లా జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించాలని నాగార్జున రెడ్డి కోరారు. 
 
కాగా, మద్యం స్కామ్‌లోని ప్రధాన కుట్రదారుల్లో మిథున్ రెడ్డి ఒకరని, లిక్కర్ పాలసీ రూపకల్పన, షెల్ కంపెనీలకు ముడుపుల సరఫరా వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ స్కామ్ ద్వారా రూ.3200 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు సిటి ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments