Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంకుశం' చిత్రంలో రామిరెడ్డికి పట్టిన గతే - అచ్చెన్నాయుడికి వైకాపా ఎమ్మెల్సీ వార్నింగ్

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:57 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంకుశం చిత్రంలో విలన్ రామిరెడ్డిని కొట్టుకుంటూ నడిరోడ్డుపై తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తానంటూ హెచ్చరించారు. 
 
ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ రోడ్డుపై తీసుకెళతామని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడు అంతు చూస్తామని, ఇదే తన ఆశయమని దువ్వాడ శ్రీనివాస్ శపథం చేశారు. 
 
సీఎం జగన్ కోసం ఏమైనా చేస్తానని, చివరకు ఆత్మాహుతి దళంగా కూడా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశలేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గమనించి నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments