Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడున్నాడురా బుజ్జీ... అవినీతిపాలన అందించే ఏకైక నేత మా జగన్!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అవినీతి గేట్లు ఎత్తేశారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై విపక్ష నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన అందిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, భారతదేశ చరిత్రలో అవినీతి పాలన అదించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అన్నదే కదా మీ సందేహం. విజయనగరం జిల్లా, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏంటంటే.. ఆయన అవినీతి నాయకుడంటూ ముఖ్యమంత్రిని కీర్తించినా.. పక్కన ఉన్న వైసీపీ నేతలు సైతం చప్పట్లు గట్టిగా కొట్టారు. 
 
నిజానికి ఎమ్మెల్యే శ్రీనివాస రావు తడబడ్డారో.. పొరబడ్డారో.. లేక మనసులో మాట చెప్పారో తెలియదుగానీ... అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కీర్తించారు. ఆయన ఈ వ్యాఖ్యలు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments