Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడున్నాడురా బుజ్జీ... అవినీతిపాలన అందించే ఏకైక నేత మా జగన్!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అవినీతి గేట్లు ఎత్తేశారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై విపక్ష నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన అందిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, భారతదేశ చరిత్రలో అవినీతి పాలన అదించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అన్నదే కదా మీ సందేహం. విజయనగరం జిల్లా, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏంటంటే.. ఆయన అవినీతి నాయకుడంటూ ముఖ్యమంత్రిని కీర్తించినా.. పక్కన ఉన్న వైసీపీ నేతలు సైతం చప్పట్లు గట్టిగా కొట్టారు. 
 
నిజానికి ఎమ్మెల్యే శ్రీనివాస రావు తడబడ్డారో.. పొరబడ్డారో.. లేక మనసులో మాట చెప్పారో తెలియదుగానీ... అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కీర్తించారు. ఆయన ఈ వ్యాఖ్యలు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments