Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు

మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:59 IST)
మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే అవకాశమే లేదన్నారు రోజా. విదేశాల నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎనర్జీ ట్యాబ్లెట్లను సిఎం రమేష్‌ కొనుక్కుని వచ్చి వేసుకుంటున్నాడని అన్నారు. 
 
రాత్రయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నాడని, సిఎం... రమేష్‌ అనారోగ్యం క్షీణిస్తోందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు రోజా. తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేస్తే మనిషి పూర్తిగా నీరసించిపోతాడని, కానీ సి.ఎం.రమేష్‌ విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారామె.
 
కేంద్రంపై పోరాడేందుకు అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments