Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (16:08 IST)
గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తనతో కాంటాక్ట్ అయినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
కాగా, ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి పండుగ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయం నృత్యం చేశారు. ఈ భోగి వేడుకల్లో అనేక మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ ధరించిన పాపానపోలేదు. 
 
ఇలాంటివారిలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఉన్నారు. ఫలితంగా ఆయన కరోనా వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments