Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (16:08 IST)
గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తనతో కాంటాక్ట్ అయినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
కాగా, ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి పండుగ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయం నృత్యం చేశారు. ఈ భోగి వేడుకల్లో అనేక మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ ధరించిన పాపానపోలేదు. 
 
ఇలాంటివారిలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఉన్నారు. ఫలితంగా ఆయన కరోనా వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments