Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే కంగాటి అనుచరులు - టోల్ ప్లాజా ధ్వంసం

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు, వారి అనుచరగణం అధికారమదంతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డుతగిలేవారిని, వ్యతిరేకించేవారిని, తమ మాటకు అడ్డు చెప్పేవారిపై దాడి చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజపై వైకాపా కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు. 
 
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఈ టోల్‌ప్లాజాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా అంటూ టోల్‌ప్లాజాను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రాణభయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఎమ్మెల్యే శ్రీదేవి జిల్లాలోని తుగ్గలి మండలం పర్యటనను ముగించుకుని డోవ్ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. 
 
తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడి ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... ఈ దాడి ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments