Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ ఇపుడు నిజంగానే చనిపోయారు : సీపీఐ రామకృష్ణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా ఇపుడు చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి వైఎస్ఆర్ ఆత్మ ఘోషించివుంటుందని చెప్పారు. 
 
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తెలంగాణాలో పోలీసులపై చేయిచేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజున టీవీల్లో కనిపించారని గుర్తుచేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబ పరువు పోయిందన్నారు. 
 
ఇవన్ని చూసి వైఎస్ఆర్ నిజంగా ఇపుడు చనిపోయి వుంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనశ్శాంతి మినహా మిగిలిన అన్నీ ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా సాగుతోందని, ఇది మరో యేడాది పాటు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇది దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన ఆయన ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments