Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ ఇపుడు నిజంగానే చనిపోయారు : సీపీఐ రామకృష్ణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా ఇపుడు చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి వైఎస్ఆర్ ఆత్మ ఘోషించివుంటుందని చెప్పారు. 
 
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తెలంగాణాలో పోలీసులపై చేయిచేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజున టీవీల్లో కనిపించారని గుర్తుచేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబ పరువు పోయిందన్నారు. 
 
ఇవన్ని చూసి వైఎస్ఆర్ నిజంగా ఇపుడు చనిపోయి వుంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనశ్శాంతి మినహా మిగిలిన అన్నీ ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా సాగుతోందని, ఇది మరో యేడాది పాటు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇది దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన ఆయన ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments