Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ప్రధాన అనుచరుడు అరెస్టుతో ఉలిక్కిపడిన వైఎస్ అవినాష్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:31 IST)
తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన దస్తగిరి ఇచ్చిన నేరంగీకార పత్రంలో పలువురు పేర్లను వెల్లడించారు. వీరిలో శివశంకర్ రెడ్డి కూడా ఒకరు. దీంతో సీబీఐ ఆయన్ను హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి, పులివెందులకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత ఆయనకు 14 రోజుల పాటు జ్యూడిషిల్ రిమాండ్ విధించింది. 
 
ఇదిలావుంటే, కడప ఎంపీగా ఉన్న అధికార పార్టీకి చెందిన వైఎస్ అవినాశ్ రెడ్డి పులివెందుల కోర్టుకు వచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు వెనుక అనేక పెద్దల హస్తమున్నట్టు దస్తగిరి వెల్లడించారు. అదేసమయంలో శివశంకర్ రెడ్డి అరెస్టుతో అవినాశ్ రెడ్డి ఆందోళనకుగురైనట్టు తెలుస్తోంది.
 
దీంతో ఆయన్ను కోర్టుకు తీసుకొచ్చినపుడు అవినాశ్ కోర్టు ప్రాంగణంలో కలిశారు. ఆ తర్వాత శివశంకర్ రెడ్డితో ప్రత్యేకంగా అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు ఆయనకు మధ్య స్వల్ప వాగ్వివాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, వైకాపా శ్రేణులు కూడా భారీ స్థాయిలో కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకుని హడావుడి చేయడం గమనార్హం. సీబీఐ అధికారుల వాహనాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments