Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : కీలక సాక్షి మృతి

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (12:32 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) అనుమానాస్పదరీతిలో మరణించాడు. అనంతపురం జిల్లా యాకిడిలోని తన ఇంట్లో ఆయన నిద్రపోగా, అక్కడే ఆయన అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
కాగా, కల్లూరి గంగాధర్ రెడ్డితి స్వస్థలం పులివెందుల. పదేళ్ల క్రితం ఆయన యాడికికి వలస వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే, వివేకా హత్య కేసులోని నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా చెలామణి పలు హత్య కేసుల్లో పాలుపంచుకున్నారు. వివేకా హత్య కేసులో గత యేడాది అక్టోబరు 2వ తేదీన సీబీఐకు వాంగ్మూలం ఇచ్చాడు. 
 
పైగా, ఈ కేసును తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ప్రలోభపెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన చివరకు సీబీఐ అధికారులపైనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇపుడు అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments