Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 30న తిరుమలకు సీఎం వైయస్‌.జగన్‌ ... షెడ్యూల్ ఇదే...

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (10:39 IST)
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 30వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్తారు. తిరుచానూరులో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడనుంచి అలిపిరి వెళ్తారు. 
 
అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుమల వెళ్తారు. తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి విశ్రాంతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్‌నిర్మాణానికీ సీఎం శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబరు ఒకటో తేదీన ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments