ఈ నెల 21వ తేదీన మూడు రాజధానులపై బిల్లు?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (10:49 IST)
మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి చుక్కెదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మూడు రాజధాలను అంశంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీష్మించి కూర్చొన్నట్టుగా తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ నెల 21వ తేదీన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం. ఈ అంశాన్ని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ మూడు రాజధానులపై శాసనసభలో చర్చించి బిల్లు ప్రవేశపెడుతామని సీఎం జగన్ తమకు చెప్పారని వెల్లడించారు. 
 
బహుజన పరిరక్షణ సమితి మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇదే అంశంపై సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ఆ సమితి నేతలు గుర్నాథం, సాంబయ్య. ఆదాం తదితరులు గురువారం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని సీఎం జగన్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. 
 
ఇదే అశంపై గుర్నాథం మాట్లాడుతూ, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 21వ తేదీన అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని తమకు హామీ ఇచ్చారని గుర్నాథం వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments