Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సోనియా - ఐదుగురితో కమిటీ

పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సోనియా - ఐదుగురితో కమిటీ
, గురువారం, 17 మార్చి 2022 (13:08 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమిపై పార్టీ విశ్లేషణ చేస్తుంది. పరాభవానికి గల కారణాలను అన్వేషించి, లోపాలను చక్కదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేపట్టారు. వచ్చే 2024 నాటికి పార్టీని పటిష్టం చేసే దిశగా ఆమె నడుం బిగించారు. ఇందులోభాగంగా, తొలుత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను ఆమె తప్పించారు. 
 
ఆ తర్వాత పార్టీ ఓటమి విశ్లేషణ కోసం ఐదుగురు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థిలను విశ్లేషించి, సంస్థాగతంగా చేయాల్సిన మార్పులనూ ఈ కమిటీ సూచన చేస్తుంది. ఇందులోభాగంగా, పార్టీ సీనియర్ నేత అజయ్ మకెన్‌‌కు పంజాబ్ బాధ్యతలను అప్పగించింది. 
 
అలాగే, మణిపూర్ బాధ్యతలను జైరామ్ రమేష్, గోవాకు రజిని పాటిల్, ఉత్తరప్రదేశ్‌కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్‌కు అవినాష్ పాండేలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించి, వాస్తవ పరిస్థితులతోపాటు సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై వారు నివేదిక అందచేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదవ తరగతి బాలికపై అత్యాచారం.. రెండు నెలల గర్భవతి?